నా టైం బాగాలేదు నన్ను వదిలేయండి …!

-

టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ లో దిల్ రాజు ఒకరు అన్న విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు సక్సస్ ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే నిర్మాతగా మారాలన్న ఆలోచనతో రాజుగారు నిర్మాణ సంస్థని స్థాపించి దిల్ సినిమాని ముందుగా నిర్మించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి రికార్డ్స్ కి సృష్ఠించింది. అప్పటి నుంచి రాజుగారు ఎన్నో అద్భుతమైన సినిమాలని నిర్మించాడు. స్టార్ హీరోలతో నిర్మించిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ సక్సస్ ని అందుకున్నాయి. మధ్యలో కొన్ని ఫ్లాపులొచ్చినా అవి దిల్ రాజు ని ఏమాత్రం కదిలించలేకపోయాయి.

 

 

ఇక దిల్ రాజు కొంతకాలంగా రీమేక్ సినిమాని నిర్మిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ పింక్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. పవర్ స్టార్ తో సినిమా తీయాలని దిల్ రాజు కి ఎప్పటి నుంచో ఉన్న కల. ఇప్పుడు ఆ కల నెరవేరుతోంది. ఈ సినిమాకి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ లో అంటే మే 15 న ఈ సినిమాని రిలీజ్ చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ మధ్య కొన్ని సినిమాలు దిల్ రాజు కి చుక్కలు చూపిస్తునాయి. చిన్న సినిమాలు మరీ దారుణంగా లాస్ ని తీసుకు వస్తున్నాయి. రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే, అలాగే రీసెంట్ గా వచ్చిన జాను సినిమాలు కమర్షియల్ గా రాజు గారికి పెద్ద బడేలా చేశాయి. వాస్తవంగా 96 రీమేక్ గా తెరకెక్కించిన జాను సినిమాలో అక్కినేని సమంత, శర్వానంద్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ముందునుంచి మంచి అంచనాలు ఉన్నాయి. కానీ అవి సినిమా రిలీజ్ అయ్యాక తారుమారయ్యాయి. దాంతో దిల్ రాజు బాగా అప్సట్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు పింక్ రీమేక్ విషయంలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవేంటంటే దిల్ రాజుకి రీమేక్ సినిమాలు కలిసి రావడం లేదని. పింక్ కూడా ఆడదేమో అన్న టాక్ నడుస్తోంది. ఇవన్ని విన్న దిల్ రాజు నన్ను వదిలేయండి అసలే నా టైం బాగాలేదని అంటున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news