ప్రభాస్ సినిమా కోసం మళ్ళీ రిస్క్ చేస్తున్న నిర్మాతలు ..?

-

ప్రభాస్ పూజా హెగ్డే జంటగా ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యువి క్రియోషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదేశాలలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటి నుంచి మిగతా టాకీ పార్ట్ మొత్తం హైదరాబాద్ లోనే జరపబోతున్నారు. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ స్టూడియోలోను సెట్స్ నిర్మిస్తున్నారట.

 

ఇప్పటికే జార్జియాలో హాస్పిటల్ సెట్ వేసి కొంత చిత్రీకరణ జరిపిన చిత్ర బృందం కరోనాతో కోట్లు పెట్టి నిర్మించిన ఆ సెట్ ని వదిలేసి వచ్చేశారు. ఇప్పుడే అదే సెట్ ని అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్నారట. నాలుగంతస్థుల హాస్పటిల్ సెట్ లో నెలరోజుల కి పైగానే చిత్రీకరణ జరపనున్నారని …ఈ సెట్ ని నిర్మించడానికి 5 కోట్లకి పైగానే మేకర్స్ ఖర్చు చేస్తున్నారని తాజా సమాచారం.

ఈ షెడ్యూల్ లో ప్రభాస్, పూజా హెగ్డే, సీనియర్ నటి భాగ్యశ్రీ తో పాటి ప్రధాన తారాగణం పాల్గొన బోతున్నారట. అయితే ఈ సినిమాకి అనవసరంగా చాలా బడ్జెట్ వేస్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. అయినా ఇంత ఖర్చు చేసి మళ్ళీ సెట్ వేస్తున్నారంటే మేకర్స్ కి కథ మీద, ప్రభాస్ మార్కెట్ మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ షెడ్యూల్ కంప్లీట్ అవగానే టీం రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్టవుతుందట. దాదాపు చిత్రీకరణ మొత్తం అక్కడే కంప్లీటవుతుందట. రాధే శ్యాం అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు చిత్ర బృందం. అంతేకాదు ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందే భారీ బడ్జెట్ సినిమా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ నిర్వహిస్తారట. ఇందుకోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news