డ్రీం ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ న్యూస్ చెప్పిన పూరి జగన్నాధ్..

-

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ “జనగణమన”. ఈ కథ కొన్నేళ్ళ క్రితమే రాసిపెట్టుకున్నారు పూరి. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు తప్ప మరెవరూ చేయరు అంటూ పూరి చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఈ కథ ప్రత్యేకంగా మహేష్ బాబు కోసమే రాశానని…ఎప్పటికైనా ఆయన తోనే తెరకెక్కిస్తాని పట్టుదలగా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా పూరి మహేష్ బాబు ల మద్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో ఇద్దరు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు.

 

దాంతో ఇక పూరి డ్రీం ప్రాజెక్ట్ పక్కన పెటారన్న వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా మహేష్ బాబు పూరి కోసం వేయిట్ చేస్తున్నాను..అయన వచ్చి అకథ నరేట్ చేస్తే సినిమా చేయడానికి నేను రెడీనే అంటూ ఓపెన్ అయ్యాడు. దాంతో ఆరోజు నుంచి మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు జనగణమన ప్రాజెక్ట్ కి సంబంధిన న్యూస్ వస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకి పూరి క్లారిటి ఇచ్చారు. జనగణమన తన డ్రీం ప్రాజెక్ట్ అని త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతానంటూ టీట్ చేశారు. అయితే అది మహేష్ బాబు తోనా లేక ఇంకెవరైనా హీరో తో చేస్తారా అన్నది క్లారిటి ఇవ్వలేదు. కాని పూరి గతంలో చెప్పిన మాటలని బట్టి మహేష్ బాబు రీసెంట్ గా పూరి తో సినిమా గురించి తన రియాక్షన్ బట్టి చూస్తే జనగణమన ఖచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే అని తెలుస్తుంది. అదే నిజమైతే ఈ సినిమా పూరి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చే హ్యాట్రిక్ సినిమా అవుతుంది. గతంలో పోకిరి వంటి ఇండస్ట్రీ రికార్డ్ తర్వాత బిజినెస్ మాన్ అన్న సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news