`ఆర్ఆర్ఆర్‌`కు షాక్ ఇచ్చిన జ‌క్క‌న్న‌.. షూటింగ్ చేయ‌నంటూ ప్ర‌క‌ట‌న‌

-

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్`. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌పుకుంటుకుంది. ఇదిలా ఉంటే.. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ ఇస్తా అంటున్నాడు. షాటింగ్ మొత్తానికి కాదండోయ్‌.. కేవ‌లం ఈ నెల 25వ తేదీనా. అస‌లు విష‌యం ఏంటంటే.. కీరవాణి కొడుకు శ్రీ సింహా హీరోగా నటించిన ‘మత్తు వదలరా’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు కీరవాణి మరో కొడుకు కాల బైరవ స్వరాలు సమకూర్చాడు.

 

ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానున్న నేపథ్యంలో రాజమౌళి ఆ సినిమాను ఉద్దేశిస్తూ మా ఇద్దరు కుర్రాళ్లు శ్రీ సింహ, కాలభైరవ ఈ మూవీతో తెరంగేట్రం చేస్తున్నారు. నాకెంతో ఎగ్జైంట్మెంట్‌గా ఉందన్నారు.మూవీ విడుదల రోజున ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ డుమ్మా కొడుతున్నట్టు ట్వీట్ చేసాడు. సో.. ఈ నెల 25న రాజమౌళి ఈ సినిమా చూడనున్నట్టు సమాచారం. కాగా, ఇటీవ‌ల రానా చేతులు మీదుగా మత్తు వదలరా సినిమా ట్రైలర్ విడుదలైంది. దీంతో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news