బాలయ్య కాదు చరణ్ వస్తున్నాడు

-

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీని నిర్మిస్తుండగా పూజా హెగ్దె, ఈషా రెబ్బలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ ను తప్పించి తమన్ ను ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు.

దాదాపు ముగింపుకు వచ్చిన ఈ సినిమా షూటింగ్ లో ఎన్.టి.ఆర్ పాల్గొన్నాడు. ఇటీవల హరికృష్ణ మరణంతో ఇప్పుడప్పుడే షూటింగ్ కు వస్తాడో రాడో అనుకోగా నిర్మాతకు బడ్జెట్ ఎక్కువవుతుందని ఆలోచించి సెట్స్ కు వచ్చాడు ఎన్.టి.ఆర్. ఇక ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ వస్తాడని అన్నారు. కాని తెలుస్తున్న సమాచారం ప్రకారం రాం చరణ్ ఈ ఆడియో స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడట.

హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ కు మాటలు కుదిరాయి. ఇలాంటి టైంలో అన్న కొడుకులకు తన సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకొచ్చాడు బాలయ్య. అందులో భాగంగానే అరవింద సమేత ఆడియోకి వస్తాడని అన్నారు. కాని బాలకృష్ణ బదులు చరణ్ అరవింద సమేత ఆడియోకి గెస్ట్ గా వస్తున్నాడట. మరి మెగా నందమూరి హీరోలు ఒకే వేదిక మీద ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news