కెరీర్‌లో తొలిసారి అలా చేసిన రణ్‌బీర్ కపూర్..ఫ్యాన్స్‌కు పండుగే..

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్..కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే రణ్ బీర్ అంటే బాగా లైక్ చేస్తుంటారు. కాగా, ఇటీవల రణ్ బీర్ ..ఆలియా భట్ ను మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. రణ్ బీర్ సినీ ప్రేక్షకులకు చివరగా ‘సంజు’ ఫిల్మ్ లో కనిపించాడు.

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంజు’ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ లైప్ స్టోరి ఆధారంగా ఈ పిక్చర్ తీశారు దర్శకుడు రాజు హిరానీ. ఈ సంగతులు పక్కనబెడితే..రణ్ బీర్ ప్రస్తుతం సినీ లవర్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

తన సినీ కెరీర్ లో తొలిసారి రణ్ బీర్ ద్విపాత్రాభినయం చేశాడు. ‘షంషేరా’ ఫిల్మ్ లో తండ్రీ కొడుకులుగా రణ్ బీర్ కపూర్ నటించాడు. యాక్షన్ ఫిల్మ్ గా వస్తున్న ఈ పిక్చర్ సక్సెస్ పైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదతవుతుండటం విశేషం. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు కరణ్ మల్హోత్ర దర్శకత్వం వహించారు. ‘బాహుబలి’,KGF, RRR ను మించిన యాక్షన్ ఈ మూవీలో ఉండబోతున్నదని విడుదైలన ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news