రష్మిక కి ఆ హీరోయిన్ కి అవార్డు వస్తుందని ముందే తెలుసా.. అందుకేనా అలా..!!

-

తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు వేడుకలలో పుష్ప సినిమాకి అవార్డుల పంట పండిందని చెప్పవచ్చు. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడుగా ,ఉత్తమ డైరెక్టర్ గా, ఉత్తమ సంగీత దర్శకుడుగా ,ఉత్తమ గాయని ,ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఇలా పలు కేటగిరిలో పుష్ప సినిమా అవార్డులను సొంతం చేసుకున్నది. అయితే ఇందులో నటించిన రష్మిక కు మాత్రం అవార్డు రాలేదు. అయితే ఈ విషయం రష్మికకు ముందే తెలుసు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.

అవార్డు జాబితా ప్రకటిస్తున్న సమయంలో కచ్చితంగా పుష్ప చిత్రంలో ఉత్తమ నటిగా రష్మిక అందుకుంటుంది అని అందరూ భావించారు. కానీ రష్మిక మాత్రం ఆ సమయంలో మాల్దీవుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. తీరా అక్కడ ఉత్తమ నటి రెండు విభాగాలకు కూడా సాయి పల్లవి పేరు వినిపించడంతో రష్మిక అభిమానులు షాక్ అయ్యారు. సాయి పల్లవి రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. సాయి పల్లవి నటనకు కూడా ఫిలిమ్ అవార్డు కచ్చితంగా అందుకోవాల్సిందే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక తన బాడి లాంగ్వేజ్ తో మాత్రమే మెప్పించింది.

ఇక అంతే కాకుండా డి గ్లామరస్ గా కూడా కనిపించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే రష్మికకు ఫిలింఫేర్ అవార్డు రాలేదని విషయం ముందుగానే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే ఆమె ఫీలిమ్ ఫేర్ అవార్డులో వేడుకకు దూరంగ ఉండి. మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది అనే విషయం ఇప్పుడు బాగా వైరల్ గా మారు తోంది. అయితే అవార్డు రాలేదని దిగులు ఆమెకేమీ లేనట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news