మాస్ మహరాజ్ డబుల్ ధమాకా..!

-

రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ తో హిట్ అందుకున్న మాస్ మహరాజ్ రవితేజ ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలతో ఫ్లాప్ చవిచూశాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటుగా విఐ ఆనంద్ డైరక్షన్ లో మరో సినిమా కన్ఫాం చేశాడు రవితేజ.

నేల టిక్కెట్టు నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్లూరి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా రవితేజ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విఐ ఆనంద్ ఆ తర్వాత అల్లు శిరీష్ తో చేసిన ఒక్క క్షణం అంచనాలను అందుకోలేదు. రవితేజ సినిమా కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది.

సినిమాలో రవితేజ తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడట. మిడిల్ ఏజ్ గెటప్ లో రవితేజ మొదటిసారి కనిపిస్తున్నాడు. మరి ఈ ద్విపాత్రాభినయం ఎంత మేరకు ప్రేక్షకులను మెప్పించేలా చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news