మెగా హీరో గల్లీ బోయ్ అవుతాడా..!

-

బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న రణ్ వీర్ సింగ్ ఈమధ్యనే గల్లీ బోయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 50 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా 100 కోట్లు వైపు పరుగులు తీస్తుంది. రణ్ వీర్ సింగ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో వచ్చిన సింబా సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు.

టెంపర్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు గల్లీ బోయ్ తో కూడా హిట్ అందుకున్నాడు ఈ క్రేజీ హీరో. ఇదిలాఉంటే గల్లీ బోయ్ సినిమాను చూసిన అల్లు అరవింద్ ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే గల్లీ బోయ్ తెలుగు రైట్స్ కొనేసిన అరవింద్ మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో ఈ సినిమా చేయాలని చూస్తున్నారట. చిత్రలహరి సినిమాతో బిజీగా ఉన్న తేజూ ఆ సినిమా తర్వాత గల్లీ బోయ్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా డైరక్టర్ ఎవరు.. మిగతా కాస్ట్ అండ్ క్రూ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news