విశాఖపట్నంలో బాలీవుడ్ హీరో.. నేవీ అధికారులతో దిగిన ఫొటోలు వైరల్..

-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ..తన సినిమాలతో ప్రజలను ఎంతలా ఎంటర్ టైన్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజెంట్ ఆయన తన మూవీస్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, అంత బిజీ షెడ్యూల్స్ లో ఆయన ఒక రోజంతా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి..అలా ఎలా అని మీరు అనుకోవచ్చు. కానీ, అలా జరిగిందండోయ్..స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ సల్లూ భాయ్.. తాజాగా విశాఖపట్నంకు వచ్చారు.

భారతదేశంలో నిర్మించిన అతి పెద్ద డిస్ట్రాయర్లలో ఒకటైన ఐఎన్ఎస్ విశాఖపట్నంలో నేవీ అధికారులతో కలిసి రోజంతా టైమ్ స్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే నేవీ అధికారులతో సరదాగా పలు చాలెంజెస్ లో పార్టిసిపేట్ చేశాడు సల్లూ భాయ్.

పలువురికి ఆటోగ్రాఫ్ లు ఇచ్చిన అనంతరం నేవీ అధికారులతో పుష్ అప్ చాలెంజ్ లలో పాల్గొన్న సల్లూ భాయ్.. నేవీ అధికారులతో హాయిగా గడిపేశాడు.తన బిజీ లైఫ్ లో ఇలా అధికారుల కోసం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టైమ్ కేటాయించిన సల్లూ భాయ్ కు అధికారులు థాంక్స్ చెప్పారు.

ఓడలో నేవీ అధికారులతో కలిసి వంట చేసిన సల్మాన్ భాయ్.. వారితో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ‘సల్మాన్ భాయ్.. నిజమైన దేశ భక్తుడు, ‘సూపర్ సల్మాన్ భాయ్’, గ్రేట్ సల్మాన్’ అని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘టైగర్ 3’, ‘కబీ ఈద్ కబీ దివాళి’ పిక్చర్స్ షూటింగ్స్ లో సల్మాన్ త్వరలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news