అర్జున్ రెడ్డి డైరక్టర్ మహేష్.. గీతా ఆర్ట్స్ క్రేజీ ప్రాజెక్ట్..!

-

విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసి దర్శకుడిగా మొదటి సినిమానే తన టాలెంట్ ఏంటో చూపించాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతోనే అతనో స్టార్ డైరక్టర్ అనేలా చేసుకున్నాడు. ఇక ఆ సినిమాతో విజయ్ కు యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఏర్పడిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన క్రేజ్ తో వెంటనే సినిమా చేయకుండా కాస్త టైం తీసుకుంటున్నాడు సందీప్ వంగ.

ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేసే ఆలోచనలో ఉన్న సందీప్ ఆ సినిమా కథను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. షుగర్ ఫ్యాక్టరీ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా అసలైతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రావాల్సి ఉంది. కాని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ చేతుల్లోకి వెళ్లిందట. మహేష్ డేట్స్ గీతా ఆర్ట్స్ వారి దగ్గర ఉండటంతో మైత్రి వారు వెనక్కి తగ్గారట.

అర్జున్ రెడ్డి తర్వాత అదిరిపోయే కాంబినేషన్ లో వస్తున్న సదీప్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. తన మార్క్ చూపించేలా కథని సిద్ధం చేశాడా లేక మహేష్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా కథ రాసుకున్నాడో ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news