తమన్‌పై ట్రోల్స్‌పై స్పందించిన సతీమణి శ్రీవర్ధిని

-

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్​ ఎస్ఎస్ తమన్ గురించి తెలియని వారుండరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రజెంట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే తమన్​ ట్యూన్లు కాపీ చేస్తుంటాడని నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా తన భర్త తమన్‌పై వస్తోన్న ట్రోల్స్‌ గురించి ఆయన సతీమణి, గాయని శ్రీవర్ధిని తొలిసారి స్పందించారు. విమర్శలను తాను పట్టించుకోనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి వాటిని పట్టించుకుంటే ముందుకు సాగలేమన్నారు.

‘‘తమన్‌ – నేనూ మణిశర్మ గారి వద్ద పని చేశాం. మాది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లయ్యాక సుమారు ఆరేళ్లు నాకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. అది నాకెంతో స్పెషల్‌ సాంగ్‌. ఆయన మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ‘కిక్‌’లో నేనొక పాట పాడా. అది నాకెప్పటికీ ప్రత్యేకమే. మావారు ట్రోల్స్‌ పట్టించుకోరు. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ నేనూ చదవను. నెగెటివ్‌ కామెంట్స్‌ చూసి బాధపడతామని తెలిసినప్పుడు.. వీడియోల కింద వచ్చే కామెంట్స్‌ చదవడం ఎందుకు? అని నేను అనుకుంటా’’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news