రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చిన హీరో.. నిజమెంత..?

-

యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఎక్కువగా సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులారిటీని దక్కించుకుంది. నిజానికి వీరిద్దరి మధ్య ఏమీ లేకపోయినా సరే కేవలం ప్రోమో కోసం షో టిఆర్పి రేటింగ్ కోసం అలా నటించాల్సి వచ్చిందని చాలా సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ నిజంగానే వీరిద్దరూ వివాహం చేసుకుంటే.. చూడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు. ఇక సుధీర్ విషయాన్ని పక్కన పెడితే యాంకర్ రష్మీ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా విడుదలై మంచి హిట్ ట్రాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి రాజ్ తరుణ్ అలాగే మోడల్ జెస్సీ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ షో ఎపిసోడ్ ప్రోమో మొదటి నుంచి ఎండింగ్ వరకు చాలా స్పెషల్ గా జరిగిందని స్పష్టం అవుతోంది.

ఈ క్రమంలోని ప్రోమో ఎండింగ్లో ఒక టాస్క్ లో భాగంగా సోషల్ మీడియాలో వారి గురించి వచ్చే పుకార్లు.. వదంతులు, చాలామంది పెట్టే థంబ్ నెయిల్స్ ను చూపించి సమాధానం చెప్పాల్సిందిగా యాంకర్ రష్మీ కోరింది. అందులో భాగంగానే హైపర్ ఆది , నరేష్ లతోపాటు రష్మీకి కూడా ఒక ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే “ఒక ప్రముఖ హీరో రష్మీకి విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడని.. ఆ హీరో ఎవరని?” ఇంద్రజ అడగగా. ఈ విషయంపై రష్మీ స్పందిస్తూ.. ఆ హీరో ఎవరు అని అనడంతో వెంటనే అక్కడికి ప్రోమో కట్ చేశారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది ఎవరో కావాలని థంబ్ నెయిల్ పెట్టినట్లు కూడా స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news