అమేజింగ్ రిజల్ట్: 200 కోట్ల వసూళ్లకు సమీపంలో “ది కేరళ స్టోరీ”

-

వివాదాలతో పాటు జర్నీ చేసిన తాజా చిత్రం “ది కేరళ స్టోరీ”.. ఈ సినిమాను సుదీప్తో సేన్ ఎంతో చక్కగా వాస్తవికతకు అద్దం పట్టేలా చిత్రీకరించారు. ఇందులో ఆదా శర్మ హీరోయిన్ గా నటించగా… మిగిలిన పాత్రలలో కొందరు నాయికలు నటించారు. ఎన్నో వివాదాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని విమర్శకుల ప్రసంశలు అందుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 171 .72 కోట్ల కలెక్షన్ లను సాధించినట్లు కానీమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమాను రోజు రోజుకీ ఆదరిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను బహిష్కరిస్తున్న నేపథ్యంలో సినిమా బృందం కోర్ట్ కు వెళ్లడంతో వారికి అనుకూలంగా తీర్పులు వస్తున్నాయి.

 

ఇక ఈ సినిమా ఇలాగే నిలకడగా కలెక్షన్ లు సాధిస్తే మరో రెండు రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరుతుందని ఆశాభావాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news