గొడవ సహజమే.. అల్లు ఫ్యామిలీతో గొడవలపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబాలలో మెగా ఫ్యామిలీ ,అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లే ఇండస్ట్రీలో 8 మందికి పైగా హీరోలు ఉన్నారు. అయితే ఈమధ్య మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి అని, వారికి అస్సలు పడడం లేదు అంటూ వార్తలు బాగా జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై చిరంజీవి , అల్లు అరవింద్ వంటి వారు కూడా వివరణ ఇచ్చినప్పటికీ కూడా వార్తలు ఏమాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..

నాగబాబు మాట్లాడుతూ..” అల్లు అరవింద్ గారిది.. చిరంజీవి గారిది సుదీర్ఘమైన ప్రయాణం.. ఈ ప్రయాణంలో ఒకటి రెండు మాటలు అటు ఇటు ఉండవచ్చు.. అంతెందుకు నాకు పవన్ కళ్యాణ్ కి మధ్య కూడా అలాంటి చిన్న చిన్న మాటలు ఉంటాయి. అయితే ఒక ఫ్యామిలీగా చూస్తే అన్నయ్యగారు, అరవింద్ గారు కలిసే ఉంటారు. బయట వినిపించేవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. పవన్ కళ్యాణ్ , బన్నీ, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా అందరూ కూడా ఎవరి ఐడెంటిటీ కోసం వాళ్లు ప్రయత్నిస్తున్నారు. కానీ అందరూ కూడా కలిసే ఉంటారు . ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరి ప్రయాణం వారిది. ఇంతకుముందు చెప్పినట్లు అభిప్రాయాలలో ఒకటి రెండు కుదరకపోవచ్చు కానీ దానినే సమస్యగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

గొడవలు అనేవి సహజమే.. ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి .. కానీ మేము ఎప్పుడూ ఒకే కుటుంబంలో ఉంటాము. అందరం హ్యాపీగా ఉంటాము ఇకపై మీరు మా విషయంపై చింతించాల్సిన అవసరం లేదు” అంటూ మరొకసారి మెగా అల్లు ఫ్యామిలిలో గొడవలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నాగబాబు.

Read more RELATED
Recommended to you

Latest news