నో షూటింగ్స్‌.. చిగురించిన ఆశలన్ని చితికిపోయాయా..?

-

త్వరలో సినిమా చూడబోతున్నమనుకున్న సినీ ప్రేమికులకు చేదు వార్త.. షూటింగ్స్‌ స్టార్స్‌ చేద్దామంటే కరోనా మహమ్మారి అవ్వనిస్తేనా..? స్టార్ట్‌ అయిన సినిమాలు కూడా నో షూటింగ్స్ బోర్డు పడేలా ఉంది..  టాలీవుడ్ లో దాదాపు 3నెలల కి అష్ట కష్ఠాలు పడి పర్మిషన్స్ తెచ్చుకున్నారు చిత్ర ప్రముఖులు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్ళీ షూటింగ్స్ మొదలయ్యాయి. అంతేకాదు బుల్లితెర మీద సందడి చేసే అనేక టీవీ సీరియల్స్ ..కామెడీ షోస్ కి మళ్ళీ ఛానళ్ళు కొత్త ప్రొమోస్ వేస్తూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు టీవీ సీరియల్స్ ..వాటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు మోస్ట్ పాపులర్ అయిన జబర్దస్త్ వంటి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ కూడా ప్రారంభమయ్యాయి.

 

ఇక సినిమా ఇండస్ట్రీలో పర్మిషన్ రాగానే అందరికంటే ముందు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో సెట్స్ కి వెళతాడనుకుంటే ముందు రెండు రోజులు మాక్ షూట్ నిర్వహించి అది సక్సస్ అయితే షూటింగ్ కి వెళ్ళలనుకున్నారు. కాని ఇంతవరకు ఆ మాక్ షూట్ జరగనేలేదు. కాని కొత్త రకమైన ఐడియాలతో సిల్వర్ స్క్రీన్ మీద సినిమాని కొత్తగా ఆవిష్కరించే రవిబాబు మాత్రం తన సినిమాని షూటింగ్ ని ప్రారంభించాడు. అలాగే మెగా మేనళ్ళుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కూడా రీసెంట్ గా రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది.

దాంతో ఒక్కో మేకర్ మళ్ళీ నెమ్మదిగా తమ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వద్దామని సన్నాహాలు చేస్తుండగానే ప్రముఖ నిర్మాత..కమెడియన్ బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. మళ్ళీ అందరిలోను రక రకాల అనుమానాలు మొదలయ్యాయి. దానికి బలాన్ని చేకూర్చింది బుల్లితెర నటుడికి కరోనా పాజిటివ్ వచ్చిన వార్త. అలాగే చెన్నై లోను ఇదే పరిస్థితి నెలకొనడంతో అక్కడ మళ్ళీ షూటింగ్స్ ని నిలిపివేశారు. ఇప్పుడు మన చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెర షూటింగ్స్ ని ఇంకొంతకాలం ఆపాలన్న ఆలోచనకి వచ్చారట మేకర్స్. ఇప్పుడిప్పుడే చిన్నగా ఆశలు చిగురిస్తుంటే ఇండస్ట్రీకి, బుల్లితెరకి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల కి వచ్చి కరోనా పాజిటివ్ అందరి ఆశలని ఆవిరి చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news