టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ …అంతటా పూజా హెగ్డే …!

-

ప్రస్తుతం తెలుగు లో బ్యూటి ఫుల్ హీరోయిన్ పూజ హెగ్డే మోస్ట్ వాంటెడ్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా ఉన్న పూజా హెగ్డే తన స్పీడ్ బాగా పెంచేసింది. ‘అరవింద సమేత’, ‘మహర్షి’ సినిమాలు భారీ కమర్షియల్ సక్సస్ లను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. ఈ సినిమా తో ఇక పూజా మిగతా హీరోయిన్స్ కి గట్టిగా పోటీ ఇస్తూ నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తో పాటు అక్కినేని అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ లో నిర్మిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

 

అంతే కాదు పూజా హెగ్డే బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తోంది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కుతున్న రెండు భారీ సినిమాలలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు గనక సూపర్ హిట్ అయితే ఇక బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవడం ఖాయమని అంటున్నారు. ఇదే కాదు పూజా కి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ హెగ్డే మీద మీద కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు.

రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు తాజా సమాచారం. సింగం చిత్రాల డైరెక్టర్ హరి చాలాకాలం తర్వాత సూర్య హీరోగా ‘అరువ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సూర్య-హరి ల కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. హరి – సూరూ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సింగం సిరీస్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో పూజా నటించబోతుండటంతో కోలీవుడ్ లో మంచి క్రేజ్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news