రోడ్ యాక్సిడెంట్ : టాలీవుడ్ నిర్మాత మృతి !

-

నల్లగొండ : దామరచర్ల మండలం కొండ్రపోల్ వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇక మృతులు నెల్లూరుకి చెందిన కమలకర్ రెడ్డి (48),తండ్రి నందగోపాల్ రెడ్డి(75) గా గుర్తించారు. వీరికి కేఎఫ్సీ ఎంటర్ టైన్మెంట్ పేరుతొ ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది.

వీరిద్దరూ కలిసి చివరిగా దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన కనులు కనులను దోచాయంటే సినిమాని తెలుగులో కొని రిలీజ్ చేశారు. నందగోపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన్ని హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని గుద్దడంతో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news