అమరవీరుల కోసం బాలీవుడ్ ఏం చేసిందంటే…!!

-

బాలీవుడ్ సంచలనాలకు పేరు. దేశంలో ఎక్కడ ఏది జరిగినా బాలీవుడ్ ప్రముఖల స్పందనలు అందరినీ ఆకర్షిస్తాయి. అటువంటి కోవలోకి వచ్చేది ఈ కింది వృత్తాంతం. దేశంలో అత్యంత సంచలనం లేపిన పుల్వామా దాడి అందరికీ తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానులకు నివాళి అర్పించేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఒక్కటయ్యారు. అమరవీరుల పోరాట స్ఫూర్తిని మననం చేసుకుంటూ రూపొందించిన ఓ ప్రత్యేక వీడియో గీతంలో వారుభాగస్వాములుఅయ్యారు.

తు దేశ్ మేరా.. అంటూ సాగే ఈ వీడియోలో ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, ఐశ్వర్యరాయ్, రణ్‌బీర్ కపూర్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్ కనిపించి అమరవీరులకు జోహారులు అర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గీతాన్ని విడుదల చేయనున్నారు. దానికి ఒకరోజు ముందుగా ఈ పోస్టర్‌ను సీఆర్‌పీఎఫ్ ట్విటర్‌లో విడుదల చేసింది. హ్యాట్యాఫ్ టూ బాలీవుడ్ స్టార్స్. దేశమాత సేవలో తరిస్తున్న వారందరికీ ఐడే శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news