డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైన త్రిష.. తొలిసారి తెలుగులో..!

-

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న త్రిష ఇప్పుడు ఒక్కసారిగా జోరు పెంచేసింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ -1 తో త్రిష మళ్లీ ఊపందుకుందని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి పేరు రావడంతో వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలోని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె క్రేజ్ ఎంతలా మారిపోయింది అంటే ప్రస్తుతం తమిళంలో మూడు , మలయాళం లో ఒక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. సినిమాలతో పాటు డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది ఈ ముద్దుగుమ్మ.

ముఖ్యంగా దళపతి విజయ్ సినిమాలో హీరోయిన్గా ఈమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని ఆఫర్లు కూడా ఈమె ఖాతాలో చేరిపోయాయి. ఈ క్రమంలోని డిజిటల్ ఎంట్రీ కి కూడా సిద్ధమయ్యింది త్రిష. మొదటి సారి తొలి సిరీస్ బృందా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సిరీస్ తెలుగులోకి తెరకెక్కి.. మిగతా భాషలన్నింటిలోకి కూడా డబ్బింగ్ కాబోతోంది. సూర్య వంగల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు సమాచారం.. మొదటిసారి త్రిష ఇలాంటి పాత్ర చేయబోతోంది. అంతేకాదు ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇలా యాక్షన్ సీన్స్ చేయడం తో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ప్రస్తుతం డిజిటల్ ఎంట్రీ సందర్భంగా బృందా పార్ట్ వన్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా త్రిష స్పందించింది . బృందా షూటింగ్ పూర్తి చేసాము .. షూటింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను.. అంటూ తెలిపింది . అంతేకాదు తెలుగులో ఇమె మొదటిసారి ఈ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటూ ఉండడం గమనార్హం. త్రిష ఈ సిరీస్తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

Read more RELATED
Recommended to you

Latest news