త్రివిక్రంతో చిరు.. వివిఆర్ వేదికపై సినిమా ఎనౌన్స్..!

-

గురువారం జరిగిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ప్రస్థానం గురించి త్రివిక్రం మాట్లాడిన తీరు మెగా ఫ్యాన్స్ అందరిని ఖుషి అయ్యేలా చేసింది. ఇక చిరంజీవి కూడా వినయ విధేయ రామ సినిమాకు పనిచేసిన అందరి గురించి మాట్లాడారు. గెస్ట్ గా వచ్చిన కె.టి.ఆర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసించారు. తమ్ముడు స్విట్జర్లాండ్ లో ఉన్నాడని ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన చిరంజీవి త్రివిక్రంతో తన సినిమా కన్ఫాం చేశారు.

డివివి దానయ్య చాలా లక్కీ ప్రొడ్యూసర్ అని.. ఈ ఇయర్ ఆల్రెడీ భరత్ అనే నేను హిట్ కొట్టాడని.. సంక్రాంతికి వినయ విధేయ రామ వస్తుందని.. ఈ సినిమా తర్వాత ఆర్.ఆర్.ఆర్ కూడా అతని నిర్మాణంలోనే వస్తుందని అన్నారు. ఇంకో విషయం ఏంటంటే తన నిర్మాణంలో త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఉంటుందని ఊహించని విధంగా ఆ క్రేజీ కాంబోని కన్ఫాం చేసి మెగా ఫ్యాన్స్ ను అలరించారు చిరంజీవి.

తనకు రాం చరణ్, మీ అభిమానం రెండు చాలని.. రీ ఎంట్రీ టైంలో కాస్త డౌట్ ఉండేదని కాని ఖైది నంబర్ 150 సూపర్ హిట్ అవడంతో తనకు నమ్మకం కుదిరిందని అన్నారు. ట్రైలర్, రష్ చూసి శభాష్ అని తొడకొట్టిన సందర్భం కూడా ఉందని చెప్పారు చిరంజీవి. చూస్తుంటే సినిమా మాస్ ఆడియెన్స్ కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకున్నారని తెలుస్తుంది. అందుకే చిరు, చరణ్ ఇద్దరు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. మరి వీరు మాట్లాడటం బాగుంది.. సినిమా కలక్షన్స్ రూపంలో ఎలా మాట్లాడేలా చేస్తుందో చూడాలి.

అయితే, ‘సైరా..’ తర్వాత కొరటాల శివతో మూవీ ఉంటుందనీ, అది కూడా రాంచరణ్ నిర్మిస్తాడని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. మరి అది ఉందా?లేదా? ఒకవేళ ఉంటే ఏది ముందుగా స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదు. చిరంజీవి 152వ చిత్రంగా రాబోతోంది శివదా.. త్రివిక్రందా అనే సందేహంతో అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news