ఆగ‌స్టు 25న ఇండియా షేకైపోతుంది: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

విజయ్‌ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లైగర్ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ప్రచార చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌, మిగతా భాషల్లో అక్కడి స్టార్ హీరోలు రిలీజ్ చేశారు. ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ నా బిడ్డ అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్​తో మెప్పించేలా ఉంది.

అయితే.. ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ విజయ్‌ దేవరకొండ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మీకు మా అయ్య తెలీదు మా తాత తెలీదు. ఎవ్వడూ తెలీదు. సినిమా రిలీజ్‌ అయి రెండేళ్లయింది. ముందు రిలీజ్‌ అయిన సినిమాకు కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్‌ కే ఇంత రచ్చేంద్రా నాయన. ఆగస్టు 25 థియేటర్లు నిండిపోవాలి. గ్యారెంటీగా చెబుతున్నా. ఆగస్టు 25 ఇండియా షేక్‌ అయిపోతుంది అంటూ విజయ్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news