చిన్న విష‌యానికే రియాక్టు అయిన విజ‌య్‌.. ఇలా అయితే ఎలా!

-

హీరోల గురించి ఫ్యాన్స్ గొప్ప‌గా చెప్పుకుంటే బాగుంటుంది. అంతే గానీ హీరోలు వారి గొప్ప‌లు వారే చెప్పుకుంటే ఏం బాగుంటుంది. కాక‌పోతే వారు చెప్పుకోవాల్సి వ‌స్తే అది పెద్ద విష‌య‌మై ఉండాలి. అంతేగానీ చిన్న చిన్న‌విష‌యాల‌కు స్పందించ‌కూడ‌ద‌నేది హీరోల క్రేజ్‌కు ఉన్న ర‌హ‌స్యం. ఇక స్టార్ హీరోలు అయితే కేవ‌లం ఇంపార్టెంట్ విష‌యాల్లోనే స్పందించాలి.

కానీ రౌడీ హీరో విజ‌య్ మాత్రం ఈ లాజిక్‌ను మిస్ అయిన‌ట్టున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పూరీతో చేస్తున్న లైగ‌ర్ పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. అయితే ఈ మూవీని ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ చేసేందుకు దాదాపు రూ.200 కోట్లు ఇచ్చేందుక ఓ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆఫర్ ఇచ్చిందని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే దానిపై విజయ్ వెంట‌నే రియాక్టు అయిన కేవ‌లం రూ.200 కోట్లు ఏంటి.. థియేటర్లలో అంత‌కంటే ఎక్కువే చూస్తారని చెప్పటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఎవరి సినిమా గురించి వారికి అంచనాలు పెద్ద‌గా ఉండ‌టంలో త‌ప్పులేదు. కాక‌పోతే ఈ విష‌యాన్ని ఫ్యాన్స్ కంటే ముందే విజ‌య్ చెప్ప‌డ‌మే ఇక్క‌డ కాస్త ఇబ్బందిగా మారింది. విజ‌య్ స్పందించాల్సి వ‌స్తే అది పెద్ద విష‌య‌మై ఉండాలి కానీ చిన్న రూమ‌ర్‌కే స్పందిస్తే ఎలా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news