పరీక్షల నిర్వహణ: జగన్ సర్కార్ పై సుప్రీం సీరియస్

-

రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దు పిటిషన్ పై ఇవాళ దేశ న్యాయవ్యవస్థ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని నిలదీసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు కేరళ తెలిపింది.

ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా పక్క రాష్ట్రం తెలంగాణతో సహ అన్నీ రాష్ట్రాలు ఇంటర్, పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం ఈ పరీక్షలను ఎటు తేల్చలేకపోతున్నాయి. దీంతో అటు విద్యార్థులు, వారి పేరెంట్స్ లో కలవరం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news