ఓటీటీలో ‘విరాట పర్వం’!.. విడుదల తేదీ ఇదే

-

రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నక్సల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. 1990 లో జరిగిన కొన్ని నిజ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. నక్సల్ దళ నాయకుడు రవన్న పాత్రలో రానా నటిస్తే.. అతని ప్రేమించే అమ్మాయి వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది.

 

విప్లవ నాయకుడిని ప్రేమించిన అమ్మాయి అతని కోసం ఏం చేసింది అనేదే కథాంశం. కాగా ఈ సినిమా ఓటిటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం శుభవార్త ను అందించింది. జూలై 1న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటి చానల్ నెట్ ఫ్లిక్స్ విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ చిత్రం ఓటిటీ హక్కులను రూ. 15 కోట్లకు నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news