Virupaksha : ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష

-

కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం విరూపాక్ష. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ పొందుతోంది.సాధారణంగా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా సరే మంచి విజయం సొంతం చేసుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమాకి పార్ట్ 2 ఉండాలని అభిమానులు కోరుకుంటూ వుంటారు.

ఈ క్రమంలోనే విరూపాక్ష 2 కూడా ఉంటుందా అని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాలిడ్ రిప్లై ఇచ్చారు సాయి ధరంతేజ్. అయితే, సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జోడిగా నటించిన విరూపాక్ష మూవీ ఈనెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 21న విడుదల సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మూడు వారాల్లో రూ. 91 కోట్ల కలెక్షన్లను సాధించింది. మరోవారంలో రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news