ఇవాళ సీబీఐ విచారణకు రాలేను : ఎంపీ అవినాశ్

-

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు అవినాష్ ను అధికారులు ప్రశ్నించగా, మరోసారి విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే.. దీనిపై సిబిఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు. వివేకా హత్య కేసులో ప్రశ్నించేందుకు కోఠిలోని తమ కార్యాలయానికి నేడు రావాలని సిబిఐ నోటీసులు పంపింది. కాగా, షార్ట్ నోటీసు ఇచ్చిందని, ఇప్పటికే తనకు వివిధ పనులు షెడ్యూల్ అయిన కారణంగా నేడు రాలేనని దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. నాలుగు రోజుల తర్వాత వస్తానని ఇందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news