మహేష్ మూవీ చూసి డార్లింగ్ ఏమన్నాడంటే..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని.. దాదాపు రెండు సంవత్సరాల విరామం తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ తానేంటో నిరూపించుకున్నారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే 12వ తేదీన విడుదలయ్యి.. ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు. అయితే కథ పరంగా ఈ సినిమా కొంచెం బోర్ గా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా ప్రేక్షకులలో ఇప్పటికే ఈ పాటలు బాగా పాపులర్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక మహానటి కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో సరికొత్త గా గ్లామర్ డోస్ పెంచి హొయలు పోయిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ,మహేష్ బాబు, కీర్తి సురేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని.. వన్ మ్యాన్ షో తో ఖచ్చితంగా మళ్లీ మహేష్ బాబు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు గమనార్హం. ఇక పోతే ఈ సినిమాను నిన్న రాత్రి పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని మరి ప్రభాస్ చూసినట్లు సమాచారం. అంతేకాదు ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న వార్తలు ఏమిటంటే .. ప్రత్యేకంగా మహేష్ బాబు కోసమే ఈ సినిమా చూసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన మహేష్ బాబు ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ చాలా బాగుంది అని, ఫైట్స్, పాటలు, డాన్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అని , సినిమా చూసినంత సేపు చాలా ఎంజాయ్ చేశాను అని ప్రభాస్ తన సన్నిహితులతో చెప్పినట్లు వారు మీడియాతో తెలియజేశారు.

ఇక నిజానికి ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా రిలీజ్ వేడుకలో మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో టికెట్ల వ్యవహారం పై ముఖ్యమంత్రిని కలిసేటప్పుడు ప్రభాస్, మహేష్ కూడా కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సన్నిహితం కారణంగానే ప్రభాస్ అదేపనిగా మహేష్ సినిమా చూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news