వరుస ప్లాఫ్ ల తర్వాత కృతి శెట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

-

ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ డమ్ సంపాదించుకుంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. తను నటించిన మొదటి చిత్రంతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంది. ఇక వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే హ్యాట్రిక్ ఫ్లాప్ లను కూడా ఈ మధ్యకాలంలో చవి చూసింది. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఉప్పెన సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ముద్దుగుమ్మ. అతి తక్కువ సమయంలో టాప్ పొజిషన్ కి వెళ్ళిపోతుందని ఆమె అభిమానులు కూడా భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో.. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు పరాజయాలను చవి చూసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్న కృతి శెట్టి తన కెరీర్ గాడిలో పెట్టుకునేందుకు పలు రకాలుగా చర్యలు తీసుకోబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది.

తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటించడమే కాకుండా మిగతా పాత్రలు మరియు కథను దృష్టిలో పెట్టుకొని సినిమాలని ఒప్పుకోవాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అచలుడు అనే ఒక కోలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు బాల తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక స్టార్ హీరో సూర్య సరసన హీరోయిన్గా నటిస్తున్నది ఈ ముద్దుగుమ్మ. అలాగే నాగచైతన్యతో కలిసి NC-22 సినిమాలో నటిస్తున్నది. ఇక ఈ సినిమాతో కచ్చితంగా మళ్ళీ సక్సెస్ అవుతుందని కచ్చితంగా ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు. మరి తెలుగులో పాటు ఒకేసారి తమిళంలో కూడా తన సత్తా చాటుతుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news