వావ్; డబుల్ సెంచరి చేసిన మహేష్…! మొట్ట మొదటిసారి…!

-

మహేష్ బాబు హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శిస్తున్న ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ చిత్రం 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 115 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 100 కోట్ల షేర్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాలో

విజయశాంతి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. గ్రాస్ విషయానికి వస్తే 200 కోట్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది ఈ సినిమా. మహేష్ బాబు కెరీర్లో తొలి 200 కోట్ల సినిమా కావడంతో ఫాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా వసూళ్లు విదేశాల్లో కూడా భారీగా ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా 10.25 కోట్లు.. నార్త్ అమెరికా 8.8 కోట్లు.. గల్ఫ్ 1.25 కోట్లు.. ఆస్ట్రేలియా 0.9 కోట్లు..

సింగపూర్ 0.4 కోట్లు.. లండన్‌ 0.35 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌ 0.56 కోట్లు వసూలు చేసింది. ఇలా దాదాపు 200 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేయడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. అటు మాస్ ఇటు క్లాస్ ని ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. విజయశాంతి నటన ఈ సినిమాకు కలిసి వచ్చింది. కాగా ఈ సినిమాలో రష్మిక మంధన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news