ఆ జలపాతంలో శివుడు అందుకే ధ్యానం చేశాడా?..ఎంత అందంగా ఉందో..

-

శివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తాడు..కైలాస గిరిలో మహాదేవుడు నిత్యం ధ్యానం లో ఉంటాడు.అలాగే ఈ భూమ్మీద కూడా శివుడు ధ్యానం చేశాడు..ఆ ప్రాంతమే కైలాస జలపాతం..ఈ జలపాతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణపురంకు సమీపంలో కైలాసకోన గుహాలయం ఉంది. దీనికి పక్కనే 100 అడుగుల ఎత్తు నుండి జాలువారే కైలాస కోన జలపాతం ఉంటుంది. పద్మావతి, వెంటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు కైలాసం నుండి వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి పర్వతం యొక్క ప్రకృతి రమణీయతకు ముగ్ధులై అక్కడే కొంత కాలం ధ్యానం చేస్తూ సమయం గడిపినట్లు చెబుతారు. అందుకే ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చినట్లు పురాణ కధనం. ఈ పర్వత ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా ఉంటుంది..

ఇక్కడ ఏడాది పొడవునా నీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో మూడు జలపాతాలు ఉన్నాయి. శివ పార్వతుల మందిరాల సమీపంలో ఉన్న ప్రధాన జలపాతాలు కాకుండా ఈ జలపాతం సుమారు 4 నుండి 6 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. ఈ నీరు రెండు చిన్న చెరువుల్లోకి వెళుతుంది. ఈ నీటిలో మీరు స్నానం చేయవచ్చు. ఈ రెండు జలపాతాలకు సుగమంగా ఉండే రోడ్లు లేవు..

ఈ జలపాతం యొక్క స్వచ్చమైన, స్పష్టమైన జలాలు అనేక ఖనిజ విలువలతో పాటు ఔషధ గుణాలు కలిగి ఉంటాయని, వీటికి చాలా రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతారు. టూరిస్టులు జలపాతం యొక్క పైకి వెళ్లేందుకు అనుమతించబడరు. ఎత్తైన కొండలపై నుండి అనేక ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ దాదాపు 100 ఎత్తు పై నుండి ఈ జలపాతం పడుతుంది..అందుకే ఆ తెల్లని నీళ్లను చూడటానికి పర్యటకులు నిత్యం వస్తూనే ఉంటారు.

కైలాస కోన పుత్తూరు నుండి 13 కిలోమీటర్లు, నగరి నుండి 20 కిలోమీటర్లు, తిరుపతి నుండి 46 కిలోమీటర్లు, చెన్నై నుండి 92 కిలోమీటర్లు, చిత్తూరు నుండి 76 కిలోమీటర్లు, కాణిపాకం నుండి 86 కిలోమీటర్లు, కాంచీపురం నుండి 85 కిలోమీటర్లు, వెల్లూరు నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సహజసిద్ధ శాశ్వత జలపాతాలు చిత్తూరు జిల్లా నగరి హిల్స్ లోయలో ఉన్నాయి.అక్టోబర్ నుండి ఫిబ్రవరి మధ్య కైలాసకోన జలపాతాలు సందర్శనకు అనువుగా ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. కైలాస కోన పుత్తూర్ కు 10 కిలోమీటర్ల ముందే వస్తుంది…ఎటు వచ్చిన పుత్తురు తగులుతోంది..ఈ నీటిని మీద చల్లుకొని స్వామివారిని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం.

తిరుపతి నుంచి ఎలా చేరుకోవాలి..

తిరుపతి నుండి కైలాసకోనకు 44 కిలోమీటర్ల దూరం. బస్సు లేదా రైలు రవాణా ద్వారా చేరుకోవచ్చు.తిరుపతి నుండి సత్యవేడు బస్సు ఎక్కి కైలాసకోన రోడ్డు స్టాప్ వద్ద దిగవచ్చు.

 తిరుపతి నుండి పుత్తూరు వరకూ రైలులో వెళ్లాలి. పుత్తూరు బస్ స్టాప్ నుండి నేరుగా కైలాసకోనకు బస్సులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news