పూజ చేసేటప్పుడు వీటిని అస్సలు కింద పెట్టకండి..ఎందుకంటే?

-

భారత దేశంలోని హిందువులు ఎక్కువగా దేవుడిని నమ్ముతారు..ప్రత్యెకమైన పూజలు చేస్తారు.తమ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా తమ అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.కానీ తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడంవల్ల అది మనకు మేలు చేయడం జరుగుతుంది అనే మాట పక్కన పెడితే, లేనిపోని అనర్థాలు తెచ్చిపెడుతుంది.పూజ గది లో చేయకూడని ఆ నాలుగు పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దీపారాధన:

ఇప్పటి కాలంలో సొంతంగా నిర్మించిన గృహంలో పూజగది అనేది ఒక చిన్న అలమరలా కడుతున్నారు. ఈ చిన్న అలమర లోనే మన దేవుడు పటాలు మొత్తం అమర్చుకుంటాం. దీపం వెలిగించేటప్పుడు ఖాళీ లేక నేలమీద పెడతాము. ఇలా చేయడం అనేది అశుభంతో సమానం. ఎందుకంటే చనిపోయిన వారికి మాత్రమే దీపం అనేది నేల మీద పెడతారు. అందుకే దీపం అనేది దేవుని ఎదుట ఏదన్నా ఒక ప్లేట్లో గాని లేక తమలపాకుపైన గాని అమర్చి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.

విగ్రహాలను అమర్చడం:

పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుడు పటాలు మరియు విగ్రహలు ఏదైనా పీఠ మీద గానీ లేదా శుభ్రమైన వస్త్రం మీద గాని ఉంచాలి. మనకు తెలియక నేలమీద పెట్టేస్తూ ఉంటాం. ఇలా చేయడంవల్ల దేవతలను అవమానించినట్లు, దీని వలన ఇంటిలోని శాంతి కరువవుతుంది అని వేద బ్రాహ్మణులు వెల్లడిస్తున్నారు..

నగలు:

బంగారు ఆభరణాలు విలువైన వజ్ర వైఢూర్యాలు లక్ష్మీదేవి తో సమానం. అదే విధంగా దేవతలకు అలంకరించే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో నేలమీద ఉంచకూడదు. నేల మీద ఆభరణాలు ఉంచడం వల్ల మనం తిరిగే కాలు ధూళి వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలా ధూళి అంటుకున్న ఆభరణాలను దేవత విగ్రహాలకు అలంకరించడం ద్వారా మనం దేవతలను అవమానించినట్లే అవుతుంది.

శంఖం:

శంఖం అనేది లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. శంఖం ఇంటిలోని దేవుని ఎదుట ఊదడం వల్ల ఇంటికి సకల శుభాలూ కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శంఖాన్ని నేలపై ఉంచకూడదు.అలా చేసినట్లయితే ఆర్థిక భాధలు పెరుగుతాయి..
అందుకే ఈ నాలుగు వస్తువులను నేల మీద పెట్టకూడదు..ఇది తప్పక గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news