దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి..ఎన్నికలు రా – కేసీఆర్‌ కు లక్ష్మణ్‌ సవాల్‌

-

కేసీఆర్‌ కు కౌంటర్‌ ఇచ్చారు ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు డా,, లక్ష్మణ్. నీ ప్రభుత్వం పై ని విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పో మేము సిద్దంగా వున్నామని కేసిఆర్ కు సవాల్ విసిరారు. ఎప్పుడు ఈ పీడను వదులుకుందామా, ఈ అవినీతి ప్రభుత్వాని తరిమి కొడదమా అని ప్రజలు కళ్లకు వత్తులు పెట్టుకు ఎదురుచుస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను, అశలను మేము నేరవేరుస్తామని తెలిపారు.

బిజెపి కార్యవర్గ సమావేశాలు పూర్తి అయిన పది రోజులకు కెసీఆర్ నిద్రమత్తులో నుండి మేలుకుని ప్రధానమంత్రి పై విమర్శలు చేయడంతోపాటు నాపై వ్యక్తిగత విమర్శలు చేయడమంటే వారు ఆకాశంపై ఉమ్మి వేయడమే నాని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైనప్పటికి తెలంగాణ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి, కుటుంబ పాలన పట్ల రాజ్యసభ సభను వేదిక చేసుకుని ప్రశ్నించే వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు భరోసా కలిగించే రీతిలో కొనసాగుతానని అన్నారు. కేసిఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై స్పందించారు.

నేను సన్యాసినా, తెలంగాణ బిడ్డనా తెలంగాణ జాతికి తెలుసున్నన్నారు. 80వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకునే నీవు ఓ రాజకీయ అజ్ఞానిగా వ్యవహరిస్తున్నావు. తెలంగాణ బిడ్డను ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రానికి రాజ్యసభకు పంపిన మా నాయకుడు నరేంద్ర మోడీ. ఓర్వలేక అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నవో తెలంగాణ ప్రజానికం గమనిస్తుందన్నారు. కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పతనానికి చేరువలో పార్టీ కొట్టుమిట్టాడుతుందన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనట్లు కేసిఆర్ మాట్లాడుతున్నాన్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news