వాస్తు: మనీ ప్లాంట్ కు ఈ వస్తువును కడితే ఏమౌతుందో తెలుసా..?

-

వాస్తు ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం మంచిదే అంటున్నారు పండితులు.సంపాదనను పొందడంలో సహాయపడుతుందని చాలామంది చెబుతారు.ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన స్థలంలో మనీ ప్లాంట్ ను ఉంచకపోతే ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కనుక మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే వాస్తు ప్రకారం గా ఉంచుకోవాలి. మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే ఆగ్నేయ దిశలో నాటాలి..

వినాయకుడు ఈ దిశలో మంచిని సూచించే దేవుడు. కనుక ఈ దిశలో నాటడం వలన పుణ్యఫలం లభించే అవకాశం ఉంది. అలాగే మనీ ప్లాంట్ ను నేలకు తాకకుండా చూసుకోవాలి. తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభ సూచకం. మనీ ప్లాంట్ లక్ష్మీదేవి అభివ్యక్తి అని చెబుతారు. మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా సరే ఈశాన్య దిశలో పెట్టకూడదు. ఆర్థికంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ చొరబడుతుంది. అలాగే మనీ ప్లాంట్ ను ఎండిపోకుండా కాపాడుకోవాలి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎండిపోతే ఇంట్లో అశుభాలు జరుగుతాయి..అందుకే చెట్టుకు ఏదైనా ఆకులు ఎండిపోతే మాత్రం వాటిని వెంటనే కట్ చెయ్యాలి..

మనీ ప్లాంట్ కు ఈ దారం కట్టడం వలన ఆర్థికంగా అనేక సమస్యలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. అది ఏ దారం అంటే ఎరుపు రంగు దారం. శుక్రవారం రోజు మనీప్లాంట్ కు ఎర్రటి దారాన్ని కట్టాలి. ఇలా కట్టడం వలన ఇంటికి శుభం కలుగుతుంది. ఎరుపు రంగు విజయానికి సంకేతం. అందువలన మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కట్టడం వలన మీరు అనుకున్న పనులు విజయవంతం అవుతాయి.ఇంట్లో డబ్బు సమస్యలు తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు. అలాగే ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో సౌకర్యంగా ఉంటారు. అనుకున్న పనులు జరిగిపోతాయి. డబ్బులు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇచ్చేస్తారు..ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మనీ ప్లాంట్ తెచ్చుకోని కొమ్మలకు ఎర్రటి దారం కడితే చాలా మంచిది..వెంటనే ధన వంతులు అవుతారు..

Read more RELATED
Recommended to you

Latest news