వైభవంగా శ్రీవారి ఉత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు

-

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీవారిని అర్చకులు కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు. నేడు సాయంత్రం శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు.
కరోనా కారణంగా రెండేళ్లు నిరాడంబరంగా నిర్వహించిన స్వామి వారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. దీనికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున వస్తోన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను టీటీడీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
మరోవైపు గురువారం రోజున కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం సింహ వాహనంపై విహరించిన శ్రీవారు.. సాయంత్రం ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తూ భక్తులకు అమితానందాన్ని కలిగించారు. పురవీధుల్లో విహరిస్తున్న స్వామి వారిని చూడడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి మాఢవీధుల్లన్నీ గోవిందా అనే నామస్మరణతో మారుమోగాయి.

Read more RELATED
Recommended to you

Latest news