గోమాతను ఎందుకు పూజించాలి ?

-

హిందు సంప్రదాయంలో గోమాతను ఎంతో దైవంగా పూజిస్తారు. గోవుకు ప్రత్యేక స్థానాన్ని కేటాయించింది సనాతన సంప్రదాయం. ఎందుకు అనే విశేషాలు కొన్ని తెలుసుకుందాం…

 

ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూంగా వర్ణించడం జరిగింది. ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించిపోతాయని పురాతనకాలం నుంచే ప్రతిఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులున్నారు.

అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమద్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు.  గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. గోవులోని పృష్టభాగం లక్ష్మీస్థానంగా భావిస్తారు. పూజిస్తారు.

పూర్వకాలంలో ప్రజల జీవనవిధానంలో అతిపెద్ద వృత్తి వ్యవసాయం. దీనిలో గోవు పాత్ర చాలా కీలకం. ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాల్లో తేడా ఉంది. గోవు నుంచి వచ్చే ప్రతీ ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం అంటే పేడ సువాసన కలిగి ఉండదు.. కానీ గోవు పేడ మాత్రం సువాసనభరితంగా ఉంటుంది. అంతేకాదు గోవు నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ  ప్రతీ ఒక్కటి మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి. గోమూత్రంతో క్యాన్సర్‌ మొదటి దశలోనే అరికట్టవచ్చు అని పరిశోధనలలో తేలింది. ఒక కడుపు సంబంధ సమస్యలు, పలు ఆరోగ్యసమస్యలు దీనిద్వారా నయం చేయవచ్చు. అలాగే గోపేడతో చేసిన పిడకలను యజ్ఞాలలో, హోమాలలో వాడుతారు. అంతేకాదు నిత్యం మనం ఇంట్లో ఆవుపిడకలపై కొంచెం ఆవునెయ్యివేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు, దోమల నుంచి రక్షించుకోవచ్చు. దీనిలో ఎటువంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవు. ఇక ఆవుపాలు పసిపిల్లలకు కూడా పడుతారు. ఇవి చాలా శ్రేష్టమైనవి. ఆవునెయ్యి మేధస్సుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆవునెయ్యితో హోమం చేస్తే ఆక్సిజన్‌తోపాటు పలు క్రిమిసంహారక వాయువులు విడుదలై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తాయి. గోవు నుంచి వచ్చే ప్రతీ ఒక్కటి మనిషి మనుగడకు ఉపయోగపడేవి.

పండుగలు, గృహప్రవేశాలు, అపర కర్మలలో కూడా గోవుకు ప్రధాన స్థానం ఇస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఆవు, ఆడపిల్ల, అయ్యగారు అనే పదాలు వాడుకలో నానుడిగా మారాయి.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news