రావి ఆకులపై దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో ఊహించలేరు..!!

-

రావిచెట్టు గురించి అందరికి తెలిసిందే.. ఆరోగ్య ప్రయోజనాల నుంచి ఎన్నో విశిష్టతలను కలిగి ఉంటుంది.శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే.. అంతేకాకుండా రావి చెట్టు ఆకులను ఇంట్లో ఉంచి దానికి దీపం వెలిగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శాప,దోష,కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి.. దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు – కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు, గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు, శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు, ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం మంచిది..

అయితే ఈ ఆకును కాడ దేవుడి పటాల వైపు, ఆకు చివర మనవైపు ఉండేలా చెయ్యడం మంచిది.. అప్పుడే దోష నివారణ జరుగుతుంది..దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం.. ఆమె అనుగ్రహం పొందాలంటే.. తమలపాకుపై ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం శుభప్రదం. ఇంకా తమలపాకుపై ప్రమిదను వుంచి నేతితో దీపమెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని పండితులు చెబుతున్నారు.మీకు ఎటువంటి దోషాలు ఉన్నా ఒకసారి వెలిగించండి..

Read more RELATED
Recommended to you

Latest news