మెదక్ : నర్సాపూర్‌లో మృతదేహం కలకలం

-

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. నర్సాపూర్-తూప్రాన్ ప్రధాన రహదారి పక్కన గల కోమటికుంట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు టీ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ ఉన్నట్లుగా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news