నల్గొండ : నేడు బీబీనగర్ ఎయిమ్స్ కు గవర్నర్ రాక

-

బీబీనగర్‌ పట్టణ సమీపంలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)కు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నారని అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌లో నిర్వహించే 2021-22 ఎంబీబీఎస్‌ బ్యాచ్‌ విద్యార్థుల వైట్‌ కోట్‌ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. ఉదయం 8.45 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి 9.45 గంటలకు ఎయిమ్స్‌కు చేరుకుంటారు. 10.45గంటల నిర్వహించే వైట్‌కోట్‌ వేడుకల్లో ప్రసంగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news