వరంగల్ : భర్త వేదింపులతో భార్య ఆత్మహత్య

-

భర్త వేదింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బచ్చన్నపేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గోపాల్ నగర్‌కి చెందిన అనితకు రవీందర్‌తో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. రూ.3 లక్షలు అదనపు కట్నం తేవాలని భర్త తరచూ వేదిస్తుండడంతో వినుగు చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news