కరీంనగర్ : యువతి బెదిరింపులకు యువకుడి ఆత్మహత్య

-

ఇల్లందకుంట: మాల్యాలకు చెందిన గురుకుంట్ల అజయ్ మంగళవారం బావిలో పడి మృతిచెందాడు. ఈమేరకు ఇల్లందకుంట ASI రవీందర్ రెడ్డి చెప్పారు. సిరిసేడు గ్రామానికి చెందిన ఓ యువతి వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని యువతి, మరో ఐదుగురు మాల్యాలకు వచ్చి అజయ్‌ను బెదిరించినట్లు మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు చేశారని చెప్పారు. బెదిరింపులకు భయపడి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ASI తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version