టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!

-

ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరుసగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 5369 పోస్టుల్ని ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలివే..

 

జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 27 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం గురించి ముందుగా తెలుసుకోవాలి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉందన్న విషయం తెలుసుకోండి.. 2023 మార్చి 27 లోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల కరెక్షన్‌కు 2023 ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు అవకాశం ఉంటుంది. 2023 జూన్ లేదా జూలైలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది.. విద్యార్హతల విషయానికొస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు వయోపరిమితి ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది..

రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ముందుగా https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో New User ? Register Now పైన క్లిక్ చేయాలి. పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. గతంలోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా రెండో పద్ధతి ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను అప్లై చేసుకోవచ్చు.. ఆసక్తి కలిగిన వాళ్ళు అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news