సింగపూర్ ఓపెన్.. సింధు, సైనా శుభారంభం

-

స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో శుభారంభం అందించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు.. 21-15, 21-11 తో లియోనే టాన్ బెల్జియం పై విజయం సాధించి ఫ్రీక్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇక సైనానెహ్వాల్ 21- 18′ 21- 24 తో మాలవిక బన్సోద్ పై గెలిచి ముందంజ వేసింది.

మరో మ్యాచ్లో అస్మిత చాలిహ 21-16, 21-11 తో ప్రపంచ 12వ ర్యాంకర్ భుసానన్ పై సంచలన విజయంతో ముందంజ వేసింది. ఇక పురుషుల సింగిల్స్ భారత అగ్రశ్రేణి ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కు ఊహించని పరాజయం ఎదురైంది. సహచర ఆటగాడు ప్రపంచ 77 ర్యాంకర్ మిథున్ మంజునాథ్ శ్రీకాంత్ కు షాకిచ్చాడు. తొలిరౌండ్లోనే మిథున్ శ్రీకాంత్ పై విజయం సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news