బిగ్‌బాస్ ఫైన‌ల్స్‌: రాహుల్ ఫ్యాన్స్‌కు నాగార్జున షాక్‌

-

బిగ్ బాస్ మూడవ సీజన్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. హౌస్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్ల‌లో ఎవ‌రు ఫైన‌ల్‌గా విన్ అవుతారు ? ఎవ‌రు ర‌న్న‌ర‌ప్ అవుతారు ? ఎవ‌రికి ఓట్లు ఎలా ప‌డ్డాయ్ ? అన్న ఆస‌క్తి స‌హ‌జంగానే అంద‌రిలోనూ ఉంది. ఇక బ‌య‌ట సోష‌ల్ మీడియాలో న‌డుస్తోన్న ట్రెండ్స్ ప్ర‌కారం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న వారిలో రాహుల్‌, శ్రీముఖి మ‌ధ్యే గ‌ట్టి పోటీ నెల‌కొంద‌ని.. వీరిద్ద‌రిలో కూడా చివ‌ర్లో రాహుల్‌కే ఎక్కువ ఓట్లు ప‌డ‌డంతో రాహుల్ విన్ అయ్యాడ‌న్న చ‌ర్చ‌లు జోరుగా న‌డుస్తున్నాయి.

బ‌య‌ట ట్రెండ్స్‌ను బ‌ట్టి చూస్తే రాహుల్ దాదాపు విన్న‌ర్ అని ఆయ‌న ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. వాస్త‌వంగా పోలింగ్ ముగియ‌డానికి రెండు రోజుల ముందు వ‌ర‌కు శ్రీముఖికి ఎక్కువ ఓట్లు రాగా… శ్రీముఖి ఫ్యాన్స్ చేసిన అత్యుత్సాహంతో రాహుల్‌కు సాఫ్ట్ కార్న‌ర్ ఎక్కువై చివ‌ర్లో రాహుల్‌కు అనుకూలంగా ఓట్ల వ‌ర్షం కురిసింద‌ని తెలిసింది.

రాహుల్ విన్న‌ర్ అంటూ బ‌య‌ట న‌డుస్తోన్న ట్రెండింగ్ వార్త‌ల‌కు నాగార్జున చెక్ పెట్టాడు. ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ నాగ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ కావడంతో చాల ఎగ్జయింట్ గా ఉన్నానని, ఈ ప్రోగ్రామ్ లైవ్ లో స్టార్ మా లో వస్తుందని నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక బిగ్‌బాస్ విన్న‌ర్ గురించి బ‌య‌ట సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్ద‌ని… ఆ వార్త‌ల‌కు, రియాల్టీకి చాలా తేడా ఉంద‌ని… ఫైన‌ల్‌గా బిగ్‌బాస్ విన్న‌ర్ ఎవ‌రో ? తెలుసుకోవాలంటే ఈ రోజు లైవ్ ప్రోగ్రామ్ చూడాలని కోరాడు.

నాగ్ చేసిన ఈ ట్వీట్‌తో రాహుల్ అభిమానులకి షాక్ తగిలింది. అప్పటి వరకు రాహులే విన్నర్ అని సంబ‌రాలు చేసుకుంటోన్న వారి నోట్ల నాగ్ ట్వీట్ ప‌చ్చిగొంతులో వెల‌క్కాయ ప‌డేలా చేసింది. మ‌రి అస‌లు విన్న‌ర్ ఎవ‌రో తెలియాలంటే రాత్రి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news