బిగ్ బాస్-3: తమన్నాను క‌న్నీళ్లు పెట్టించిన చిరంజీవి.. ఏం జ‌రిగిందంటే..?

-

బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హోస్ట్ నాగార్జునతో కలిసి ఏంతో సందడి చేశారు. కంటెస్టెంట్లతో మాట్లాడుతూ తనదైన శైలిలో హాస్యం పండించారు. అయితే ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రితో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు. ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు” అని చిరంజీవి అంటుండగానే తమన్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

అసలు చిరు దేనిగురించి మాట్లాడుతున్నాడో అక్కడెవరికీ అర్థంకాలేదు. అయితే చిరంజీవి మళ్లీ అందుకుని, “ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ” అంటూ అభినందించేసరికి తమన్నా తీవ్ర భావోద్వేగాలకు లోనైంది. కాగా, ఉత్కంఠగా సాగిన ఫైనల్‌లో రాహుల్‌ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news