భారత సైన్యంలో కరోనా భయపెడుతున్న కరోనా…!

-

భారత సైన్యంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడి తో పాటుగా సరిహద్దుల్లో ప్రాణాలు పెట్టి పోరాటం చేస్తున్న భారత ఆర్మీ కరోనా బారిన పడటం ఇప్పుడు నిజంగా ఆందోళన కలిగిస్తుంది. సైనికుల్లో వందల కేసులు రోజు రోజుకి పెరగడం ఇప్పుడు మాత్రం నిజంగా ఆందోళన కలిగిస్తుంది. సరిహద్దుల్లో పహారా కాసే కీలక విభాగం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) ని ఇప్పుడు కరోనా భయం వెంటాడుతుంది.

ఈ విభాగంలో గత 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఏకంగా 73 మంది సైనికులు కరోనా బారిన పడ్డారు అంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 14 మంది కరోనా నుంచి కోలుకున్నారు. బిఎస్‌ఎఫ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1659 గా ఉందని అధికారులు వెల్లడించారు. వీటిలో 927 మంది కరోన నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news