జెనీలియాకి కరోనా పాజిటివ్.. కానీ..

-

కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో సినిమా సెలెబ్రిటీలు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా జెనీలియా దేశ్ ముఖ్, మూడు వారాల క్రితమే తనకు కరోనా సోకిందని, ఈ రోజు కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురవుతున్నారు. కరోనా బారిన పడ్డ 21రోజులకి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, ఈ మధ్య కాలం తాను ఛాలెంజింగ్ జీవితాన్ని గడిపానని తెలిపింది.

21రోజుల్లో తనకి అసలు లక్షణాలే కనిపించలేవని, ఇప్పుడు కరోనా నుండి పూర్తిగా కోలుకుని ఇంట్లో వాళ్లతో ఉంటున్నానని, ప్రేమించిన వాళ్ళు దగ్గర ఉంటే ఎలాంటి బాధ అనపించదని, తొందరగా టెస్ట్ చేయించుకోవడంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కరోనాని జయించవచ్చని తెలిపింది. మొత్తానికి కరోనాని జయించిన తర్వాత ఆ విషయాన్ని పంచుకోవడం చాలా మందికి షాకింగ్ గా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news