ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా పరీక్షలు !

-

భారత్ లో కరోనా విజృంభిస్తూనే ఉంది. కరోనా వచ్చిన కొత్తలో అన్నీ లాక్ డౌన్ లో ఉండడంతో కరోనా కేసులు కంట్రోల్ లోనే ఉండేవి. కానీ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ వదిలేయడంతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా తొంభై వేలకు దగ్గరలో నమోదవుతున్న కేసులు ఈరోజు కొంత మేర తగ్గాయి. గడచిన 24 గంటలలో 86,052 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,141 మంది మృతి చెందారు.

Coronavirus on scientific background

అలానే గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 81,177గా ఉంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,571కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 9,70,116 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 47,56,165కు చేరింది. అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 92,290కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 81.74 శాతానికి చేరింది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 16.67 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.59 శాతానికి తగ్గింది. ఇక ఈరోజు ఇండియాలో రికార్డు స్థాయిలో కరోన పరీక్షలు చేశారు. నిన్న ఒక్క రోజే 14,92,409 “కరోనా” వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటిదాకా 6,89,28,440 పరీక్సలు చేసినట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news