షాకింగ్‌.. పేషెంట్‌కి మ‌ద్యం తాగ‌మ‌ని ప్రిస్క్రిప్ష‌న్ ఇచ్చిన డాక్ట‌ర్‌..!

-

దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న 21 రోజుల లాక్‌డౌన్‌లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మ‌ద్యం ప్రియుల‌కు మ‌ద్యం ల‌భించ‌డం లేదు. దీంతో చాలా చోట్ల ఆల్క‌హాల్ అడిక్ట్స్ వింత వింతగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. కేర‌ళ‌లో అయితే ఇలాంటి వారు ఎక్కువ సంఖ్య‌లోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ కొంద‌రు మ‌ద్యం తాగక చ‌నిపోయారు. కొంద‌రిని అక్క‌డి డీ అడిక్ష‌న్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించారు. అయితే అదే రాష్ట్రంలో ఇప్పుడొక డాక్ట‌ర్‌.. ఓ పేషెంట్‌కు.. మ‌ద్యం తాగ‌మ‌ని చెప్పి ఇచ్చిన ప్రిస్క్రిప్ష‌న్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kerala doctors prescription goes viral about drinking alcohol 3 times a day

కేర‌ళ‌లోని నార్త్ ప‌ర‌వుర్ కొడుంగ‌ల్లూర్‌లో డాక్ట‌ర్ ఎండీ రెంజిత్ అనే వైద్యుడు 48 ఏళ్ల పురుషోత్తం అనే త‌న పేషెంట్‌కు మ‌ద్యం తాగ‌మ‌ని చెప్పి ఏకంగా ప్రిస్క్రిప్ష‌న్‌నే రాశాడు. అందులో రోజుకు 3 సార్లు.. పూట‌కు 60ఎంఎల్ బ్రాందీ, సోడాతో క‌లిపి తాగ‌మ‌ని, స్ట‌ఫ్ కింద వేయించిన ప‌ల్లీలు తిన‌మ‌ని.. రాశాడు. దీంతో ఆ ప్రిస్క్రిప్ష‌న్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కేర‌ళ‌లో మ‌ద్యానికి బానిసైన వారికి డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ మేర మ‌ద్యాన్ని అమ్మాల‌నే ఓ ప్ర‌తిపాద‌న ఉంద‌ని తెలిసిన కొద్ది గంట‌ల‌కే.. ఈ ప్రిస్క్రిప్ష‌న్ వైర‌ల్ కావ‌డంతో జ‌నాలు దాన్ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు.

అయితే ఈ విష‌యంపై స‌ద‌రు డాక్ట‌ర్‌ను వివ‌ర‌ణ కోర‌గా.. తాను ఆ ప్రిస్క్రిప్ష‌న్‌ను రాసిన మాట నిజ‌మే అయినా.. అది వ‌ట్టి జోక్ మాత్ర‌మేన‌ని.. అందులో నిజం లేద‌ని.. అస‌లు త‌న‌కు పురుషోత్తం అనే పేషెంట్ ఎవ‌రూ లేర‌ని.. కేవ‌లం అంద‌ర్నీ న‌వ్వించ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మేన‌ని.. అందుకు తాను సారీ చెబుతున్నాన‌ని… ఆ డాక్ట‌ర్ తెలిపాడు. దీంతో ఇప్పుడు ఆ ప్రిస్క్రిప్ష‌న్‌ను చూసి జ‌నాలు అంద‌రూ న‌వ్వుకుంటున్నారు. అయితే జోక్ కాక‌పోయిన‌ప్ప‌టికీ.. నిజానికి మ‌ద్యానికి బానిసైన వారి ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఈ క్ర‌మంలో అలాంటి వారి ఆరోగ్యంపై ప్ర‌భుత్వాలు ఆలోచన చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది..!

Read more RELATED
Recommended to you

Latest news