జైడస్ టీకా అభివృద్ధిని సమీక్షించిన మోదీ..!

-

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి పై సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు నగరాల పర్యటన చేపట్టారు. శనివారం ఉదయం గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ చేరుకున్న మోదీ.. అక్కడి జైడస్‌ క్యాడిలా బయోటెక్‌ పార్క్‌ ను సందర్శించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డీ’ టీకా ప్రయోగాలు, ప్రయోజనాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి వ్యాక్సిన్‌ ప్రయోగశాలను పరిశీలించారు.

modi
modi

ప్రస్తుతం జైకోవ్-డీ వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాల్లో ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దాదాపు గంటపాటు ప్రధాని మోదీ ప్లాంట్‌ లో గడిపారు. అంతకుముందు సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో మోదీ సమావేశమయ్యారు. మోదీ పర్యటనకు సంభందించిన వివరాలను ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అహ్మదాబాద్‌ తర్వాత ప్రధాని మోదీ.. హైదరాబాద్‌, పుణెల్లో పర్యటించనున్నారు.

హైదరాబాద్‌లో భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్’, పుణెలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ ప్రయోగాలను మోదీ పరిశీలించనున్నారు. కరోనాపై పోరులో భారత్‌ నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో వ్యాక్సిన్‌ సన్నద్ధతపై శాస్త్రవేత్తలతో చర్చించేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపింది. టీకా అభివృద్ధి, ఎదుర్కొంటున్న సవాళ్లు, దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి మార్గ సూచీ వంటి అంశాలను ప్రధాని ఈ పర్యటనలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిని చూసేందుకు జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. వారికి మోదీ అభివాదం చేశారు.

ప్రపంచ దేశాలు కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో ముందు అడుగు వేస్తున్న వేళ.. మన సొంత టీకాను అభివృద్ధి చేసేందు భారత్ ప్రయత్నిస్తోంది. అత్యధిక జనాభా కలిసిన భారత దేశంలో టీకాను అభివృద్ధి చేసి ప్రజలకు అందిచటనమనేది సవాల్ తో కూడుకున్న అంశం. కేంద్రం ఇప్పటికే టీకా పంపిణీపై కసరత్తు చేస్తోంది. మరో వైపు అగ్రరాజ్యం మరో రెండు వారాల్లో ఫైజర్ టీకాను అందుబాటులోకి తీసుకురావటానికి సన్నద్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news